ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ అనే మైథలాజికల్ మూవీ తో పాటు సలార్ అనే మాస్ యాక్షన్ డ్రామా మూవీ, అలానే ప్రాజెక్ట్ కె అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈ మూడు సినిమాలపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. ఓం రౌత్ తీస్తున్న ఈ మూవీలో సీతగా కృతి సనన్ నటిస్తోంది. 

ఇక ప్రాజక్ట్ కె ని నాగ అశ్విన్ తీస్తుండగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సలార్ విషయానికి వస్తే కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని నిర్మిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా కూడా కెజిఎఫ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా, ఒక రకంగా వాటిని మించేలా ఉంటుందని ఇన్నర్ వర్గాల టాక్. ప్రభాస్ ఈ సినిమాలో తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని పక్కా మాస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి భువన గౌడ కెమెరా మ్యాన్. అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న సలార్ తదుపరి షెడ్యూల్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన అది మరొక రెండు వారాలు పాటు వాయిదా పడిందని, దీనిని బట్టి ఈ నెలాఖరులో సలార్ తదుపరి షెడ్యూల్ బెగిన్ అవుతుందనేది లాటీసెట్ టాలీవుడ్ వర్గాల న్యూస్. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీపై ఎన్నో భారీ స్థాయి అంచనాలు పెట్టుకోవడంతో సినిమా షూట్ కనుక వాయిదా పడితే రిలీజ్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. అయితే పక్కాగా అనుకున్న సమయానికే సలార్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో మూవీని రిలీజ్ చేయాలని గట్టిగా రిలీజ్ చేసేందుకు యూనిట్ యోచన చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: