ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలలో హీరో అడవి శేషు కూడా ఒకరు. మొదట చిన్న చిన్న వేషాలు వేస్తూ తన కెరీర్ ని ప్రారంభించిన అడవి శేషు క్షణం, గూడచారి వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తరువాత తాను రూపొందిస్తున్న చిత్రం మేజర్. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు అడవి శేషు. తన కెరీర్ కి సంబంధించి అనేక విషయాలను కూడా తెలియజేశాడు.


అడవి శేషు  తండ్రిది పాలకొల్లు భీమవరం అట. తన అమ్మది మాత్రం నల్గొండ డిస్ట్రిక్ట్. కానీ అడవిశేషు పుట్టింది హైదరాబాద్లోనే పెరిగింది అంతా అమెరికాలో అంట. అడవి శేష్ హీరో కావడం వల్ల తన తండ్రికి చాలా సంతోషంగా ఉందని తెలియజేశాడు. ఇండస్ట్రీ లోకి రావడానికి తమ తల్లిదండ్రులు ప్రోత్సాహం చాలా ఉందని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చి నప్పుడు చేసేందుకు ఎవరూ లేరు కానీ ఆ తర్వాత అందరు కూడా నాకెంతో సపోర్ట్ గా నిలిచారు.. తన వెనుక మేమున్నామని భుజం తట్టి ముందుకు నడిపించాలని తెలియజేశారు.

క్షణం చిత్రం బాగుందని అల్లు అర్జున్ చేయడంతో అప్పటివరకు తన సినిమాలను మాత్రమే క్రియేట్ చేసి అల్లు అర్జున్ మొదటి సారి తన సినిమా చేయడంతో నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు. పంజా సినిమా డైరెక్టర్ ఎవరు చేసిన చాలా ఎక్కువ చేస్తున్నావు చూసుకో అని అనే గానే.. పవన్ కళ్యాణ్ వచ్చి అడ్డుపడ్డారు ఎలా చేయాలనుకుంటున్నాడు అలా చేయండి అని తెలియజేశారట. బాహుబలి సినిమా షూటింగ్ లో ప్రభాస్ దగ్గరుండి పని చేస్తున్నారు అని తెలియజేసారు. తన మీద నమ్మకంతోనే మహేష్ బాబు మేజర్ చిత్రాన్ని నిర్మించారని ఇలా ఎంతో మంది స్టార్స్ నాకు ఎంతో అభిమానంతో చూసుకున్నారని. అందుకే మీరు ఈ ప్రదేశం లో ఉన్నాను అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: