శ్రీదేవి బోనీ కపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో పలు సినిమా లలో నటించి బి టౌన్  మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి దడక్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా జాన్వి కపూర్ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది.

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ మూవీ తో జాన్వీ కపూర్ అటు ప్రేక్షకులను...  ఇటు విమర్శకులను కూడా మెప్పించింది.  గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ మూవీ తో పాటు జాన్వి కపూర్ పలు బాలీవుడ్ మూవీ లలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.  అలాగే ఆ మధ్య తెలుగు లో కూడా జాన్వీ కపూర్ కి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి అంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.  కాకపోతే ఇప్పటి వరకు జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఎంట్రీ గురించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  

ఇలా ఇప్పటికే బోనీ కపూర్ కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకుపోతుంటే తాజాగా తన కుమార్తె ఖుషి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ పై నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు...  గ్లామర్ నిండి ఉన్న మూవీ ప్రపంచాన్ని ఎవరు కోరుకోరు... అయిన సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలి అని పిల్లలు ఎవరు కలలు కనరు.  ఫస్ట్ లో మోడలింగ్ చేస్తారు,  19 - 20 సంవత్సరాల వయసు వచ్చాక,  సినిమా మరియు నటన పై వారికి ఆసక్తి ఏర్పడుతుంది.  ఆ తర్వాత నిదానంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారు అని తాజాగా బోనీ కపూర్ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: