సూపర్ స్టార్ మహేష్ బాబు  తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సొంతం మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఆ మిక్సీడ్ టాక్  ప్రభావం సినిమాపై ఏ మాత్రం పడకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.

ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదలైన సర్కారు వారి పాట సినిమా విడుదలైన అన్ని చోట్ల నుండి ప్రస్తుతం అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఒక క్రేజ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సర్కారు వారి పాట సినిమా తెలుగుతో పాటు తమిళ మలయాళ వెర్షన్ లలో కూడా ప్రముఖ 'ఓ టి టి' అమెజాన్ ప్రైమ్ లో జూన్ మూడవ వారం నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. తమిళ్ మరియు మలయాళ వెర్షన్ లను డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా,  కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖనిమూవీ లో  ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: