ఈ మధ్య ప్రేక్షకులు 'ఓ టి టి' లకు ఏ రేంజ్ లో అలవాటుపడిపోయారో మన అందరికీ తెలిసిందే. కరోనా కు మందు భారతదేశంలో సినీ ప్రేమికులు చాలా వరకు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లను చాలా తక్కువగా ఉపయోగించేవారు. కానీ ఎప్పుడైతే దేశం లోకి కారోనా ఎంటర్ అయ్యిందో అప్పటి నుండి 'ఓ టి టి' ల వాడకం చాలా బాగా పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం కారోనా కేసుల వల్ల కొన్ని రోజుల పాటు థియేటర్లపై ప్రభుత్వాలు ఆంక్షలను విధించడం, అలాగే కారోనా కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొన్ని రోజుల పాటు థియేటర్లను పూర్తిగా మూసివేయడంతో సినీ ప్రేమికులు 'ఓ టి టి' లకు బాగా అలవాటు పడిపోయారు.

దానితో ప్రస్తుతం కూడా కొంత మంది సినీ ప్రముఖులు థియేటర్లలో కాకుండా సినిమాలను 'ఓ టి టి' లో చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు.  అలా ప్రేక్షకులు సినిమాలను 'ఓ టి టి' లో చూడడానికి ఆసక్తి చూపిస్తూ రావడంతో 'ఓ టి టి' సంస్థలు కూడా ప్రేక్షకుల ముందుకు ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ను తీసుకువస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలు విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి వస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలో నటించిన కర్మణి రాంబో ఖతిజా మూవీ కూడా అతి త్వరలో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.

విజయ్ సేతుపతి, నయనతార , సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు విజ్ఞేష్ శివన్ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమా మే 27వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో  స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: