అక్కినేని సమంత కు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు ఇతర సినిమాల పరిశ్రమలలో సైతం భారీ స్థాయిలో గుర్తింపు ఉంది. అక్కడ ఆమెకు మంచి ఫాలోయింగ్ తో పాటు భారీ మార్కెట్ కూడా ఉంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే ఆమెకు అక్కడ అవి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. మినిమం హీరో సినిమా కి వచ్చే బజ్ ను తెచ్చి పెడుతుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్యతో విడాకులు పొందిన తర్వాత ఆమె చాలా డిప్రెషన్ కు లోనయింది. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవాలంటే సినిమాలు చేయడం ఒక్కటే మార్గం అని భావించి వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

ఆ సమయంలోనే సమంత పుష్ప సినిమాలోని స్పెషల్ చేసి ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. ఆ పాటలో ఈమె హైలెట్ గా నిలవడమే కాకుండా ఆ చిత్రం అంత పెద్ద విజయాన్ని సాధించడానికి గల కారణం ఈ పాటలో సమంత ఉండడమే అని చాలా మంది చెబుతుంటారు. ఈ పాట విడుదల తర్వాత బాలీవుడ్ కూడా సమంత గురించి చర్చించుకుంది.  అయితే అంతకుముందే ఫ్యామిలీ మాన్ 2 లో ఆమె నటించి బాలీవుడ్లో క్రేజ్ దక్కించుకుంది. ఆ తరువాత ఈ పాట ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

 కానీ సమంత మాత్రం వాటిని అంగీకరించ లేదు. కారణం ఏమిటో తెలియదు కానీ బాలీవుడ్ ఆఫర్లు మాత్రం ఆమె రిజెక్ట్ చేస్తుందన్నది ఎవరికీ తెలియని విషయం. తెలుగులో ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు పూర్తి చేసిన ఈమె విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వరుస తెలుగు సినిమాలు ఒప్పుకుంటున్న ఆమె బాలీవుడ్ సినిమాల్లో మాత్రం ఒప్పుకోకపోవడానికి కారణం ఉందట. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకు ఉన్న  ప్రాధాన్యత వదిలేసి బాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ గా చేసి తన ఇమేజ్ ను పోగొట్టుకోవడం ఇష్టం లేకనే అక్కడ ఆ తరహా సినిమా అవకాశాలను ఆమె రిజెక్ట్ చేస్తూ ఉంటుందట. అందుకే బాలీవుడ్ సినిమాలను ఆమె పెద్దగా పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: