బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు బాలీవుడ్ లో చత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గతంలో నటించిన సినిమాలు హిందీలో కూడా విడుదలై మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చి పెట్టడంతో తనకు విశేష ప్రేక్షకాదరణ ఉందన్న విషయాన్ని గమనించి ఈ సినిమాను అక్కడ రీమేక్ చేస్తూ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆయనను హీరోగా లాంచ్ చేసిన దర్శకుడు అయిన వివి వినాయక్ హిందీ చిత్ర పరిశ్రమకు కూడా ఆయనను పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు.

అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా షూటింగ్ పూర్తి కాలేదు. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ సిని మా లో హీరోయిన్ గా ఎవరైనా తీసుకున్నారా అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు యూనిట్. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ కథానాయికలను పరిశీలించిన కూడా ఎవరికీ ఈ సినిమాలో నటించే అవకాశం దక్కలేదు. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నుష్రత్ పేరు ను అధికారిక ప్రకటన ఇచ్చింది ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అధికారిక పోస్టర్ను విడుదల చేసింది.

వాస్తవానికి బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ పాపులర్ హీరోయిన్ తీసుకోవాలి అని భావించారు కానీ అగ్ర కథానాయికలు ఎవరూ కూడా ఈ హీరో సరసన నటించడానికి ఒప్పుకోకపోవడంతో చివరకు ఈ అవకాశం వచ్చినట్లు అయింది. బాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించింది ఈ ముద్దుగుమ్మ. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రామసేతు చిత్రంలో కూడా హీరోయిన్ కనిపించనుంది. దీంతో పాటు పలు క్రేజీ బాలీవుడ్ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇకపోతే తెలుగులో బెల్లం కొండ చేయబోయే తదుపరి సినిమా ఎవరితో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా తర్వాత ఆయన తెలుగు సినిమా చేస్తాడేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: