ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రం పైన  ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఎఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కే జి ఎఫ్ సినిమా ను భారీ స్థాయిలో తెరకెక్కించి ఘన విజయం అందుకునేలా చేసిన దర్శకుడైన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ముఖ్యకారణం. ఆ విధంగా వందల కోట్లు ఈ సినిమా కు బడ్జెట్ గా కేటాయించారు అంటే అతిశయోక్తి కాదు. శృతిహాసన్సినిమా లో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్  సినిమా అని పోస్టర్స్ నీ బట్టి అందరికీ అర్థమవుతుంది.

హాంబలే నిర్మాణ సంస్థ నుంచి కే జి ఎఫ్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో తెరకెక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ సినిమాకు రెండు మూడు రెట్లు మించి ఈ సినిమా ఉండబోతోందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. వారు ఎంత పక్కాగా ఉంటే తప్పా అంత బాగా ఈ సినిమా వచ్చిందో అనుకోవచ్చు.  ఈ నిర్మాతలు కూడా ఎంతో వైవిధ్యం చూపించడానికి నిరంతరం శ్రమిస్తూన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది.

మిగిలిన భాగాన్ని షూటింగ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఈ సినిమా యొక్క అవుట్పుట్ కూడా బాగానే వచ్చిందని అంటున్నారు.  బడ్జెట్ పరంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తప్పకుండా రెండు వేల కోట్ల రూపాయల టార్గెట్  అందుకోవచ్చు అని చెబుతున్నారు. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా కు ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఖాయం అంటున్నారు. మరి భవిష్యత్ లో ఈ సినిమా కు ఏ స్థాయి లో కలెక్షన్ లు వస్తాయి చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: