ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా.. త్వరలో రెగ్యులర్ బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారంలో ఈ షోకు తెర వేయబోతున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా గత సీజన్ ల కంటెస్టెంట్స్ చివరి వారాలలో వచ్చి సందడి చేశారు...అక్కడ కూడా గొడవలు ఎక్కువ అయ్యాయి. మామూలు షో కన్నా కూడా ఈ షో లో పెద్దగా పస లేదని అందరు అన్నారు.
70 రోజులకు పైగా సాగిన ఈ షో చివరి వారంలో అడుగుపెట్టింది. 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్కార్డ్ ఎంట్రీ కూడా తోడై 18కి చేరుకుంది. వీరిలో శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ, నటరాజ్ వరసగా ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్లో అరియానా, అనిల్, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ ఉన్నారు. ఈ టాప్ 7లో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే అంచనాలు, లెక్కలు సోషల్ మీడియాలో మొదలైపోయాయి..ఈసారి మాత్రం ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనల్స్ కు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఒకరు వారం మధ్యలోనే హౌస్ను వీడే అవకాశం ఉండగా.. మిగిలిన ఆరుగురు ఫినాలేలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది.వీటిలో అఖిల్, బిందు మాధవి పేర్లు వినిపిస్తున్నాయి.. అఖిల్ పేరు బయట వినిపిస్తోంది.