తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. ఒకవైపు నిర్మాతగా చేస్తూనే మరో వైపు సినిమాలను విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం ఈయన తమిళ్ డైరెక్టర్ తో ఒకటి.. తమిళ్ హీరోతో మరొకటి.. రెండూ భారీ సినిమాలే ప్లాన్ చేశాడు దిల్ రాజు. ఈ రెండు ప్రాజెక్టుల్లో స్టార్ కాస్ట్ ను కూడా భారీగానే సెట్ చేశాడు.అయితే చరణ్ సినిమా కన్నా ముందు విజయ్ సినిమాకు ప్రిఫరెన్స్ ఇచ్చి, సడెన్ గా ప్లాన్ చేంజ్ చేశాడు స్టార్ ప్రొడ్యూసర్. ఇప్పుడు మెగా అభిమానుల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.



రామ్ చరణ్, శంకర్, విజయ్, వంశీ పైడిపల్లి లాంటి రేర్ కాంబినెషన్ లో సినిమాలను నిర్మిస్తున్నారు.విజయ్ మూవీలో హీరోయిన్ గా రష్మికను ఫిక్స్ చేసిన దిల్ రాజు.. తమిళ్ సీనియర్ యాక్టర్స్ శరత్‌ కుమార్, ప్రభులతో పాటూ ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్, జయసుధ లాంటి సీనియర్ యాక్టర్స్ ను వంశీ కిచ్చారు. వీరితో పాటు కిక్ శామ్‌, యోగిబాబు, సంగీత, సంయుక్త వంటి వారు విజయ్ 66లో కీ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకరాస్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం హీరో విజయ్ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న తెలంగాణ సీఎం ను కూడా కలిశారు.



శంకర్ కోరిక మేరకు హీరోయిన్ గా కియారా అద్వాణీని పట్టుకొచ్చి… అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర లాంటి యాక్టర్స్ ని అందించారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ ఈ సినిమాను సంక్రాంతికి అందించబోతున్నట్టు అనౌన్స్ చేశారు. దిల్ రాజు కూడా అనేక సందర్భాల్లో సంక్రాతికే రిలీజ్ అని ఫ్యాన్స్ ను ఊరించారు. అయితే చరణ్ ఇప్పుడు వ్యూహం మార్చారు..కానీ విజయ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.మార్చి నెలాఖరులో రిలీజ్ చేబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజ్ ప్లాన్ తో మెగా అభిమానులు అసంతృప్తి ఫీలవుతున్నారు కాని, 2018 మార్చి 30న రిలీజ్ అయిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్ తో చరణ్ 15త్ మూవీని కూడా వచ్చే ఏడాది మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసి, పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ కొట్టాలని దిల్ రాజ్ ప్లాను లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: