దక్షిణాది సినిమా రంగంలో భారీ సినిమాలకు చిరునామాగా ఒక వెలుగు వెలిగిన దర్శకుడు శంకర్ హవాను రాజమౌళి తన భారీసినిమాల సక్సస్ తో శంకర్ ను డామినేట్ చేసాడు. ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళికి ఇక ఎదురులేదు అని అందరూ భావిస్తున్న పరిస్థితులలో ‘కేజీ ఎఫ్’ ‘కేజీ ఎఫ్ 2’ లతో ప్రశాంత్ నీల్ రాజమౌళి ఇమేజ్ ని దాటిపోయాడు.


ఇలాంటి పరిస్థితులలో ప్రశాంత్ నీల్ కు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ మూవీని తీస్తున్న ప్రశాంత్ నీల్ కు ఆమూవీ షూటింగ్ సమయంలో ఒక ఆలోచన వచ్చిందట. త్వరలో అతడు తారక్ తో తీయబోతున్న మూవీని మల్టీ స్టారర్ గా మార్చి ఆమూవీలో జూనియర్ ప్రభాస్ ల కాంబినేషన్ పెట్టగలిగితే ఆమూవీకి షూటింగ్ ప్రారంభం నుండి విపరీతమైన క్రేజ్ వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది అన్న ఆలోచన ప్రశాంత్ నీల్ కు వచ్చిందట.


దీనితో తన ఆలోచనలను ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు షేర్ చేయడం జరిగింది అంటున్నారు. ఇప్పుడు జూనియర్ కూడ ఈ మల్టీస్టారర్ ఆలోచనలకు ఓకె అంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ప్రభాస్ లు కలిసి నటించడం ఖాయం అన్నవార్తలు అప్పుడే సందడి చేస్తున్నాయి. అయితే వీరిద్దరిని ఒప్పించగలిగే కథ ఎప్పటికి ప్రశాంత్ నీల్ రెడీ పెట్టగలడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈవార్తలు ఇలా బయటకు రావడంతో కొందరు రాజమౌళిని దృష్టిలో పెట్టుకుని కామెంట్స్ చేస్తున్నారు.


జూనియర్  ప్రభాస్ లతో రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యం మరే దర్శకుడుకి లేదు. వారిద్దరినీ రాజమౌళి ‘నువ్వు అని పిలిస్తే వారిద్దరూ అన్నా’ అంటూ ప్రేమగా సమాధానం ఇస్తారు. ఇంత సాన్నిహిత్యం ఉన్న రాజమౌళి ఆలోచనలకురాని ప్రభాస్ జూనియర్ ల మల్టీ స్టారర్ ల మూవీ ప్రశాంత్ నీల్ ఆలోచనలలో ఎలా వచ్చింది ఒకవేళ వచ్చినా అది సాధ్యం అయ్యే పనేనా అంటూ మరికొందరు ఆశ్చర్యపడుతున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: