మంచు కుటుంబాన్ని కొందరు సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేస్తున్న విధానం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో ఏమాత్రం తగ్గకుండా సమానమైన స్టార్‌ డమ్‌ ను కలిగి ఉన్న సీనియర్ హీరో మోహన్‌ బాబు ను ఇంకా అలాగే ఆయన ఫ్యామిలీని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక మోహన్ బాబు సినిమాల్లో కాస్త తగ్గిపోయాడు. కొడుకులు కూడా సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. అయినా కూడా మంచు కుటుంబం సోషల్‌ మీడియాలో ట్రోల్స్ కు బలి అవుతుందంటే కారణం వారు మాట్లాడే మాటలనే చెప్పుకోవాలి.వారు పదే పదే సొంత డబ్బు కొట్టుకుంటూ పాత విషయాలను అనేక సార్లు చెప్పుకోవడమే అనేది కొంతమంది అభిప్రాయం.ఇక కలెక్షన్ మోహన్‌ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా తో ఏ స్థాయిలో దిగజారి పోయారో అందరికి తెల్సిందే. నటుడిగా ఆయన సూపర్. సినిమా కూడా మంచి సందేశాత్మక సినిమా. కానీ పాతిక కోట్లు ఖర్చు పెట్టి తీసినా కూడా ఈ మూవీ కనీసం కోటి వసూళ్లను కూడా రాబట్టలేక మొదటి రోజే రెండవ షో నుండి థియేటర్లు మూత పడ్డాయి అనే వార్తలు కూడా వచ్చాయి. మంచు మోహన్‌ బాబు ఆ అవమానంతో మళ్లీ సినిమాలు చేయాలంటేనే అవసరమా అన్నట్లుగా కంగారు పడుతున్నారనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.



సన్నాఫ్ ఇండియా సినిమా నష్టాల నుండి మెల్ల మెల్లగా మంచు వారు బయట పడుతున్నారు. ఈ సమయంలో సన్నాఫ్ ఇండియా సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు.మోహన్ బాబు గారు సన్నాఫ్ ఇండియా సినిమా ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయంను పెద్దగా ప్రచారం చేయలేదు. విష్ణు కాని ఇతర మంచు కుటుంబం వారు కాని సన్నాఫ్ ఇండియా సినిమా స్ట్రీమింగ్‌ విషయాన్ని వెళ్లడించలేదు. వారు ఏ చిన్న సోషల్ మీడియా పోస్ట్ చేసినా ఇంకా ఏ ప్రచారం చేసినా కూడా సన్నాఫ్ ఇండియా సినిమాకు నష్టమే తప్ప లాభం లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. సన్నాఫ్ ఇండియా గురించి మాట్లాడి మళ్లీ మీడియా ముందుకు వచ్చి పరువు పోగొట్టుకోవడం తప్ప మరేం లేదు. అందుకే వున్న పరువు పోకుండా సన్నాఫ్ ఇండియాను పూర్తిగా వదిలేసి ముందస్తు జాగ్రత్త పడ్డారంటూ సోషల్‌ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. మంచు వారు పట్టించుకోకున్నా కూడా సన్నాఫ్‌ ఇండియాపై మాత్రం కొందరి ట్రోల్స్ ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: