అలా వంశీ పైడపల్లి ప్రాజెక్ట్ అటకెక్కి పరుశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు మహేష్. అయితే ప్రాజెక్ట్ మహేష్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి దళపతి హీరో విజయ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ రిజెక్ట్ చేసిన కథను హీరో విజయ్ ఒకే చేశారు అన్నది ప్రజెంట్ టాక్. ఇదిలా ఉండగా... ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు... డబుల్ రోల్ ఉన్న కారణంగానే అప్పట్లో మహేష్ ఈ స్టోరీని వద్దు అనుకున్నారని సమాచారం.
బేసిక్ గా మహేష్ కి డబుల్ రోల్ అంటే ఇష్టం ఉండదట.. అందుకే కథలో కొత్తదనం వున్న డ్యుయల్ రోల్ కావడంతో అప్పుడు మహేష్ తప్పుకున్నారు అని అంటున్నారు. కాగా గతంలో నాని సినిమాలో మహేష్ డబుల్ రోల్ చేయగా అది పెద్దగా...వర్కౌట్ అవ్వకపోడంతో అప్పటి నుండి డ్యుయల్ రోల్ చేయకూడదని అనుకున్నారట. దీనితో ఫ్యాన్స్ కూడా అందులో నుండి తప్పుకోవడమే మంచిదని మహేష్ కె సపోర్ట్ చేస్తున్నారు.