అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు భారీగా పారితోషకం అందుకున్నారు అని f2 సినిమాతో పోలిస్తే ఎఫ్ 3 కి భారీగా పారితోషకం డిమాండ్ చేసి మరీ అందుకున్నారు అని తెలుస్తోంది. దిల్ రాజు కూడా చేసేది లేక అడిగినంత ఇచ్చేసారట. వెంకటేష్ ఎంత సక్సెస్ఫుల్ హీరో అయినా ఆయన పారితోషకం ఇప్పటి వరకు 6 లేదా 7 కోట్లకు మించ లేదట. అయితే ఎఫ్ 3 సినిమాకి గాను ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకున్నారట.
అయితే f2 కోసం వెంకీ తీసుకున్న పారితోషకం 5 కోట్లు కాగా... సీక్వెల్ కి ఏకంగా 3 రెట్లు పెంచేశారు. ఇక ఈ సినిమా టోటల్ బడ్జెట్ 50 కోట్లు కాగా అందులో ఎక్కువ భాగం నటీనటులకు సరిపోయింది. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్, సునీల్, వెన్నెల కిషోర్ , అలి వంటి వారికి సైతం ఈ సినిమాలో నటించినందుకు గాను భారీగానే పారితోషకం అందింది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇది అంచనాలకు అందుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మధ్య రొటీన్ కు భిన్నంగా అన్నీ సినిమాలు వస్తున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి కాస్త తెలుగు ప్రేక్షకుల అభిరుచిని గమనించి కామెడీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.