మెగా ఫ్యామిలీ పరువును నిహారిక నడిరోడ్డు పాలు చేసిందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. భర్త జొన్నలగడ్డ చైతన్యతో లిప్ లాక్ చేసిన ఫోటో పై సోషల్ మీడియా లో పెద్ద దుమారం రేగింది. ఇప్పటికే రెండు మూడు సార్లు వివాదంలో చిక్కుకున్న మెగా కూతురు నిహారిక మరోసారి ఇలా ట్రోలర్స్ కి దొరికిపోయింది. ఆమె తన భర్తకు ఇచ్చిన లిప్లాక్ ఫోటో వైరల్ ఇప్పుడు అవుతోంది. ఇక నిహారిక ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి జోర్దాన్ కి వెకేషన్ ట్రిప్ కి వెళ్ళింది. ఇక అక్కడ తన భర్త చైతన్య జొన్నలగడ్డ తో కలిసి ఆమె బాగా ఎంజాయ్ చేసింది.వాటి తాలూకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ట్రోలర్స్ ఇప్పుడు నిహారికకు పాపం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్స్ ఆమెను బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ట్రోలర్స్ రెచ్చిపోవడానికి కారణం ఆమె పంచుకున్న ఫోటోలో నిహారిక తన భర్త చైతన్యకు లిప్ లాక్ ఇవ్వడం. ఆమె ఆ ఫోటోని బ్లర్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మరొకటి చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోని కూడా షేర్ చేసింది. ఎప్పటికీ విడిపోని బంధం అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది నిహారిక. అయితే భర్త కి లిప్ లాక్ ఇస్తున్న ఫోటోని ఇలా పంచుకోవాల్సిన అవసరం ఏంటనేది ట్రోలర్స్ ప్రశ్న. దీన్ని బేస్ చేసుకుని నెటిజెన్స్ నిహారికని దెబ్బకు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఒక రేంజ్ లో ప్రశ్నిస్తూ ఆమెను బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.



మెగాస్టార్ పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి ఫోటోలు ఎందుకు షేర్ చేసుకోవడం? అసలే మెగా ఫ్యామిలీ రోడ్డెక్కింది. ఇప్పుడు ఇది కూడా అవసరమా సిస్టర్ ? అంటూ ఆమెపై పోస్టులు పెడుతున్నారు. మెగా డాటర్ రెచ్చిపోయిన వేళ నిహారిక లోని బోల్డ్ యాంగిల్ అంటూ తమదైన శైలిలో కూడా కామెంట్లు పెడుతున్నారు. ఈ లిప్ లాక్ కిస్ ఫోటోలకు మీమ్స్ ని కూడా జోడించి వైరల్ చేస్తున్నారు. దీంతో నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. మరి కొంతమంది నిహారికను సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇక ఆమెకు ఎదురవుతున్న అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం అని తమ భార్య భర్తల బంధం ఎంత బలంగా ఉందో చెప్పేందుకు నిహారిక ఇలా చేసిందని ఆ భార్యాభర్తల ఫోటోలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఓవైపు పాజిటివ్ గా మరోవైపు నెగిటివ్ గా కూడా మరోసారి వార్తల్లో నిలుస్తోంది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి: