తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు పరుశురాం  దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందు మహేష్ బాబు ప్రమోషన్స్లో భాగంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం ఏమైనా ఉందా అని అడిగితే మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ అఫర్డ్ చేయలేదని చెప్పడం అభిమానులకు సైతం షాక్ కు గురి చేయడం అన్నీ జరిగిపోయాయి.

ఇకపోతే మహేష్ బాబు సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్ లో కూడా అంతే బిజీగా ఉంటూ సూపర్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇకపోతే ఇటీవల ఒక పాన్ మసాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ నెటిజన్లకు దొరికేశారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇకపోతే తాజాగా ఇప్పుడు నెటిజన్లు సైతం సూపర్ స్టార్ ను ఏకిపారేస్తున్నారు. దీంతో మహేష్ బాబుని బాలీవుడ్ మాత్రం ఆఫర్ చేయలేదు కానీ పాన్ మసాలా బ్రాండ్ చేయగలదా అంటూ మహేష్ బాబు ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు పైగా ఆ పాన్ మసాలా యాడ్ లో మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ సినిమాలు తనని అఫర్డ్ చేయలేము కానీ మహేష్ బాబు మళ్లీ అదే బాలీవుడ్ హీరోలతో కలిసి పాన్ మసాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తారా అంటూ అభిమానులు కూడా మహేష్ పై కామెంట్ చేయడం ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అల్లు అర్జున్, షారుక్ ఖాన్ , యశ్ లాంటి హీరోలు ఇప్పటికే ఇలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి ససేమిరా అంటున్న నేపథ్యంలో మహేష్ బాబు ఇలా చేయడం పాన్ మసాలా ప్రమోట్ చేయడం చాలా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: