నందమూరి
బాలకృష్ణ గత ఏడాది అఖండ సినిమాతో సాధించిన
సక్సెస్ గురించి ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. గత ఏడాది
డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు
బోయపాటి శ్రీను మరియు నందమూరి
బాలకృష్ణ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ
సినిమా తర్వాత నందమూరి
బాలకృష్ణ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ సినిమాతో ఫాం లోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని తన 107
సినిమా ను మొదలు పెట్టాడు.
శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ
సినిమా పక్కా
మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తుండగా విలన్ పాత్రలో
కన్నడ నటుడు దునియా
విజయ్ నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటి
వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే గోపీచంద్ మలినేని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారట. కొత్తగా రెండు
మాస్ సీన్స్ యాడ్ చేయబోతున్నారట. హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే విధంగా ఆ రెండూ సీన్స్ ఉంటాయని చెబుతున్నారు.
బాలకృష్ణ ప్రతి సినిమాలోనూ డివోషనల్ టచ్ ఉండడంతో ఈ సినిమాలో కూడా ఆ సన్నివేశాలు పెడితే సెంటిమెంటల్ గా
సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో గోపీచంద్ మలినేని ఈ విధమైన మార్పులు చేస్తున్నారట. మరి ఈ రెండు సీన్లు ఈ
సినిమా ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి
తమన్ సంగీతం సమకూరుస్తున్నగా ఈ చిత్రంలో
బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని అంటున్నారు. మరి అయన ఇలా చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయిన వేళా ఈ
సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటాయో చూడాలి.