ఇప్పటికీ పలు చోట్ల రెగ్యులర్ గా హౌజ్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే బాహుబలి రికార్డులను కూడా కేజీఎఫ్ చిత్రం బ్రేక్ చేసి అగ్ర స్థానంలో నిలిచేలా కనిపిస్తోంది. తమ అభిమాన హీరో యశ్ చిత్రం ఈ స్థాయిలో ఆదరణ పొందుతుండటంతో ఫ్యాన్స్ సంతోషంతో ఉరకలు వేస్తున్నారు. ఈ సినిమాలో తమ హీరో చెప్పిన డైలాగ్ ను గుర్తుచేసుకుంటూ కరెక్ట్ గా చెప్పావ్ బాస్ అంటున్నారు. ఇంతకీ ఏమిటా డైలాగ్ అంటే... ఈ చిత్రం లో హీరో యశ్ ఒక సందర్భం లో నేను ఇండియా కి సిఇఒ ని అంటూ భారీ డైలాగ్ చెబుతాడు. కాగా ఇపుడు ఈ సినిమా కురిపిస్తున్న కాసుల వర్షం చూసిన ప్రేక్షకులు మీరు బాక్సాఫీస్ సీఈవో రాఖీ బాయ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఊహించిన దానికంటే భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం శరవేగంగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ను దాటేయగా వరల్డ్ వైడ్గా చూస్తే పన్నెండు వందల కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసింది. .. ఇటీవల కొన్ని బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు రిలీజయ్యాయి. అయినప్పటికీ 'కేజీయఫ్ 2' హిందీలో తగ్గేదేలే అన్నట్లుగా 430 కోట్లు రాబట్టడం విశేషం. ఇక కేజీఎఫ్ 3 కూడా వచ్చేస్తే ఇంతకు మించిన హైప్ క్రియేట్ చేయడం ఖాయం. ఇది ఇలాగె మరో వారం కొనసాగితే 1500 కోట్లు ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ టార్గెట్ చేరుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో తన డైరెక్షన్ పవర్ ను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకుడు ప్రశాంత్ నీల్.