చిరంజీవి పవన్ కళ్యాణ్ ల వీరాభిమానులు తమ హీరోలు గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు ఎవరైనా తమ హీరోల గురించి పరోక్షంగా కామెంట్స్ చేస్తే చాలు వారిపై రగిలిపోతూ ఉంటారు. దీనితో మెగా హీరోల పై ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ లపై ఎవరైనా భయపడిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి అనుకోకుండా తనకు తెలియకుండానే ఇప్పుడు మెగా అభిమానుల టార్గెట్ కు గురి కాపడుతోంది.


చిరంజీవితో దర్శకుడు మెహర్ రమేష్ తీస్తున్న ‘భోళా శంకర్’ మూవీలో కీలకమైన చెల్లెలు పాత్రకోసం సాయి పల్లవిని సంప్రదిస్తే ఆమె చిరంజీవి చెల్లెలుగా నటించడానికి తిరస్కరించింది అని అంటారు. ఈవిషయమై చిరంజీవి ఆమధ్య జరిగిన ఒక ఫిలిం ఫంక్షన్ లో తనకు ఎదురైన సాయి పల్లవిని ప్రశ్నిస్తూ తనతో కలిసి నటించడానికి సాయి పల్లవికి ఏమిటి సమస్య అంటూ ఓపెన్ గానే నవ్వుతూ ప్రశ్నించాడు.


ఇప్పుడు ఈమూవీలో చిరంజీవి పక్కన చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయంతెలిసిందే. లేటెస్ట్ గా సాయి పల్లవి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో తీయబోతున్న మూవీలో చెల్లి పాత్రలో నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అత్యంత కీలకమైన ఈపాత్ర సాయి పల్లవికి బాగా నచ్చడంతో ఆమెను ఆ పాత్రకు ఓకె చేసింది అని టాక్. ఇప్పుడు ఈవార్తలు వైరల్ కావడంతో చిరంజీవి పక్కన చెల్లెలుగా నటించడానికి అంగీకరించని సాయి పల్లవి మహేష్ పక్కన ఎలా నటిస్తోంది అంటూ మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


లేటెస్ట్ గా సాయి పల్లవి ‘సర్కారు వారి పాట’ మూవీని రహస్యంగా ఒక మల్టీ ప్లెక్స్ లో హైదరాబాద్ లో చూసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవార్త కూడ వైరల్ కావడంతో చిరంజీవి అభిమానులు మరింత మండిపోతున్నారు. మెగా స్టార్ తో నటించే అవకాశం కన్నా మహేష్ తో నటించే అవకాశం ఎక్కువా అంటూ ఆమెను మెగా అభిమానులు ప్రశ్నిస్తూ ఆమెను కన్ఫ్యూజ్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: