అప్పటి వరకు కూడా కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రమే అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా పాపం ఆచార్య సినిమాతో మొట్టమొదటిసారిగా కెరీర్ లో ఎప్పుడూ మరిచిపోలేనంత డిజాస్టర్ ను అందుకున్నారు.యస్ యస్ రాజమౌళి తరువాత అపజయం ఎరుగని దర్శకుడిగా మంచి పేరున్న కొరటాల శివకు ఆచార్య సినిమాతో వచ్చిన పేరు అంతా కూడా దెబ్బకు పోయింది.ఇక ఆ సినిమా విడుదలైన తర్వాత నుంచి కూడా కొరటాల శివ పై అభిమానుల్లో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత చిత్ర బృందం నుంచి ఒక్కరు కూడా సినిమా ఆ కలెక్షన్ల గురించి మాట్లాడలేదు.మెగాస్టార్ చిరంజీవి ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మొట్ట మొదటి సినిమాగా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ కూడా సినిమా డిజాస్టర్ అవడానికి గల కారణం కొరటాల శివ మాత్రమే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన్ని తెగ ట్రోల్ చేశారు. 


కానీ ప్రస్తుతానికి కొరటాల శివ పై ట్రోలింగ్ ఇక తగ్గిందనే చెప్పొచ్చు. ఈ మధ్య ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు కలగడంతో మెగాస్టార్ చిరంజీవి తో పాటు కొరటాల కూడా ముందుకు వచ్చి డిస్ట్రిబ్యూటర్లకు కొంత నష్ట పరిహారాన్ని చెల్లించి వారికి ఊరట కలిగించారు.ఇక అప్పటి నుంచి మళ్లీ కొరటాల శివ పై నెగిటివిటీ కొంచెం తగ్గింది. అదే ఇప్పుడు కొరటాల శివ తదుపరి సినిమాకి కి బాగా ప్లస్ అయింది. కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనిరుధ్ అందించిన సంగీతం కూడా చాలా బాగానే ఉంది. ఇక ఎన్టీఆర్ గురించి కొరటాల శివ కొన్ని పవర్ ఫుల్ డైలాగులు చెప్పటం అయితే అభిమానులు దృష్టిని బాగానే ఆకర్షించింది. ఏదేమైనా ఆచార్య సినిమా ఎఫెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా పై ఉండదని అభిమానులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: