అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు , తమిళ భాషల లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. కీర్తి సురేష్ ఇటు తెలుగు సినిమాలలో నటిస్తూనే,  అటు తమిళ సినిమా లలో  కూడా నటిస్తూ  ప్రస్తుతం మోస్ట్ బిజీయేస్ట్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ తమిళంలో నటించిన సాని కాయుదం  సినిమా ప్రముఖ 'ఓ టి టి' అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుంది. ఈ సినిమాను తెలుగులో చిన్ని పేరుతో విడుదల చేయగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటుంది.  వరుస అపజయాలతో డీలా పడిపోయిన కీర్తి సురేష్ తిరిగి సాని కాయుదం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా సాని కాయుదం మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ ఆ వెంటనే విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ 'కళావతి' అనే పాత్రలో నటించింది.  మహేష్ బాబు హీరోగా , కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.  గతంలో అభిమానులు తనను మహానటి అని పిలుస్తూ ఉండేవారు అని,  కానీ సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన తర్వాత కళావతి అని పిలుస్తున్నారు అని చెప్పుకొచ్చింది.  ఈ చేంజ్ ఓవర్ చాలా బాగుంది అని , సర్కారు వారి పాట సినిమాలో తన నటన బాగుంది అని ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది అని కీర్తి సురేష్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: