సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ స్టామినా గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు అదిరిపోయే రేంజ్ లో వస్తూ ఉంటాయి. అదే బాక్సాఫీస్ దగ్గర కనుక మహేష్ బాబు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే ఆ బీభత్సం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.  ప్రస్తుతం అలాంటి వాతావరణమే సర్కారు వారి పాట థియేటర్ల వద్ద కనిపిస్తుంది.  

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తొమ్మిది రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా తొమ్మిదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 46 లక్షలు
సీడెడ్ : 21 లక్షలు
యూ ఎ : 24 లక్షలు
ఈస్ట్ : 17 లక్షలు
వెస్ట్ : 13 లక్షలు
గుంటూర్ : 7 లక్షలు
కృష్ణ : 7 లక్షలు
నెల్లూర్ : 5 లక్షలు
తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా 1.40 కోట్ల షేర్ ,  2.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను  సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా  99.65 కోట్ల షేర్ , 122 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: