ఇక కొరటాల శివతో జూ. ఎన్టీఆర్ తన 30వ సినిమాకు కమిటైనప్పుడే.. ఇందులో హీరోయిన్ గా నటించేందుకు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆ విషయాన్ని పలుసార్లు ఆలియా కన్ఫమ్ చేసింది కూడా!అయితే.. అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకపోవడం ఇంకా రణ్బీర్‌ కపూర్ తో పెళ్ళి కూడా అయిపోవడంతో.. ఆలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుండి కూడా NTR30లో హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా చర్చలు మొదలయ్యాయి.ఆలియా భట్ తప్పుకున్నాక మేకర్స్ చాలామంది హీరోయిన్లని పరిశీలించారు. ఇదో పాన్ ఇండియా సినిమా కాబట్టి.. హిందీలో మంచి మార్కెట్ ఇంకా క్రేజ్ ఉన్న భామనే తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ పేరు కూడా తెరమీదకొచ్చింది. ఆమె దాదాపు కన్ఫమ్ అయ్యిందన్న ప్రచారమూ కూడా జరిగింది. కానీ, ఆ తర్వాత జాన్వీని అసలు సంప్రదించనే లేదని క్లారిటీ కూడా వచ్చేసింది. కొన్ని రోజుల తరువాత సాయి పల్లవిని ఎంపిక చేశారని టాక్ నడిచింది.



అయితే, యూనిట్ వర్గాల నుంచి కూడా ఆ విషయమై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇంతలో శ్రద్ధా కపూర్ పేరు కూడా తెరమీదకొచ్చింది. 'సాహో'సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఇక ఈమెనే ఫైనల్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని రూమర్లొచ్చాయి. ఇందులో కూడా వాస్తవం లేదని తేలిపోయింది.ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ భామ పేరు కూడా తెరమీదకొచ్చింది. ఇక ఆమె మరెవ్వరో కాదు.. దిశా పటాని. నిత్యం బికినీ ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాని బాగా హీటెక్కిస్తోన్న ఈ భామని కథానాయిక పాత్రకు తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈమెని ఎంపిక చేస్తే, మార్కెట్ పరంగా కూడా బాలీవుడ్‌లో కలిసొస్తుందని, అలాగే గ్లామర్ కూడా తోడవుతుందని మేకర్స్ ఉద్దేశం. అయితే, ఇది నిజమా? కాదా? అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ దిశా పటాని కన్ఫమ్ అయితే మాత్రం, ఇక ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఆమె దశ తిరిగిపోవడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: