సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారట.


సినిమాలోని ఒక సన్నివేశంలో కీర్తి సురేష్ మహేష్ ను బో* అంటూ ఆమె తిడుతుంది. దర్శకుడు మహేష్ ను అలా తిట్టించడంపై మహేష్ బాబు అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు కూడా వినిపించాయి.


అయితే సినిమాలోని ఆ సీన్ కు సంబంధించి కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారట.మహేష్ ను అలా తిట్టే సమయంలో తన గుండె ఆగిపోయింది అని ఆమె చెప్పుకొచ్చారు. మహేష్ ఫ్యాన్స్ తనపై సీరియస్ అవుతారని అనిపించిందని కీర్తి సురేష్ కామెంట్లు కూడా చేశారు. మహేష్ బాబు ముఖం చూసి అలా తిట్టడం తన వల్ల కాలేదని ఆమె అన్నారట.. మొదట తాను ఆ డైలాగ్ ను  ఎంతో మెల్లగా చెప్పానని ఆమె కామెంట్లు చేశారు.


దర్శకుడు ఒప్పుకోకుండా ముఖం మీద చూపించి తిట్టాలని చెప్పారని కీర్తి సురేష్ వెల్లడించారట.మొత్తానికి ఎలాగోలా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని అయితే ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ కూడా భయపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మహేష్ బాబు సైతం ఈ తిట్టు గురించి స్పందించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారట.మూడు టేకులు అయినా కీర్తి సురేష్ తనను తిట్టలేకపోయిందని మహేష్ కూడా కామెంట్లు చేశారు.


ఆ సమయంలో దుబాయ్ లో ఎండ మండిపోతుందని సన్నివేశం ఓకే కావడం లేదని మహేష్ చెప్పుకొచ్చారు. తాను కీర్తి సురేష్ దగ్గరకు వెళ్లి తిట్టు తిట్టు అని మొరపెట్టుకున్నానని మహేష్ కూడా చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కూడా తిట్టాలని గట్టిగా చెప్పడంతో కీర్తి సురేష్ తిట్టక తప్పలేదని మహేష్ బాబు వెల్లడించారు. మహేష్ బాబు వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: