కే జి ఎఫ్ సినిమా తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ డైరెక్టర్ పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఎందుకంటే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియా సినిమాగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. అతి తక్కువ సమయంలోనే కొన్ని వందల కోట్ల షేర్ వసూలు చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ సినిమా. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించింది మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు .
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేయగా అది కూడా బాగా వైరల్ గా మారుతుంది. అంతే కాదు ఇందులో ఎన్టీఆర్ ఇంటెన్సివ్ లుక్ కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్న ఎన్టీఆర్ ను ఎదుర్కోవడానికి విలన్ ఎవరు అనే విషయం మొన్నటివరకు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త ఏమిటంటే ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.ఇదివరకే కమల్ హాసన్ కి ప్రశాంత్ నీల్ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో కమలహాసన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రశాంత్ తన సినిమాలలో హీరోలను, విలన్స్ ను ఒకే రేంజ్ లో ఉండేలా చేస్తారు. అందుకే కమలహాసన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఇంకా క్లారిటీ వచ్చే వరకు ఎదురు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: