జాతీయ అవార్డును సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో కొంచెం స్లో గా ఉన్నా.. తర్వాత స్టడీగా ముందుకు సాగుతూ ప్రస్తుతం స్పీడ్ పెంచేస్తున్నాడు. ఇక తాజాగా ప్రవీణ్ సత్తార్ నాగార్జునతో కలిసి ఘోస్ట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మొదటి సారి పాన్ ఇండియా సినిమా అంటూ ప్రవీణ్ సత్తార్ మూవీకి అప్పుడే డేట్స్ కూడా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్లుగానే సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతోనే నిర్మాతలు కూడా ఉన్నారని సమాచారం . ముఖ్యంగా అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ లో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివరికి అంతా సినిమాను ముగించాలని ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్రం యూనిట్. ఇక సినిమాకు సంబంధించి అన్ని వివరాలు కూడా జూన్ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో వరుణ్ తేజ్ అవుతాడో లేదో తెలియాల్సి ఉంది.