కోలీవుడ్ హీరో విశాల్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశాల్ 'పందెం కోడి' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నాడు.  పందెం కోడి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకున్న విశాల్ ఆ తర్వాత తాను నటించిన దాదాపు అన్ని సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ పోతున్నాడు. అందులో భాగంగా హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా విశాల్ నటించిన దాదాపు ప్రతి మూవీ ని తెలుగు లో డబ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. 

అందులో భాగంగా విశాల్ నటించిన డిటెక్టివ్ , అభిమన్యుడు మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విశాల్ 'సామాన్యుడు' మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో డింపుల్ హాయతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విశాల్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. సామాన్యుడు  సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచిన విశాల్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా  విశాల 'లాఠీ' అనే సినిమాలో హీరోగా నటించాడు. 

మూవీ లో విశాల్ సరసన సునైన హీరోయిన్ గా కనిపించబోతుంది.  ఈ సినిమాకు ఎ. వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా  విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. లాఠీ  మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. మరి లాఠీ సినిమాతో విశాల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: