ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి రాధేశ్యామ్ డిజాస్టర్ తర్వాత ఆయన హీరోగా చేస్తున్న సలార్ చిత్రం షూటింగ్ త్వరలోనే రెగ్యులర్ గా జరుపుకుంటుంది. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఆయన ఇతర సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు పెడతారని చెబుతున్నారు.

కే జి ఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ వీళ్లు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్లుగా ఇప్పటి వరకూ వచ్చిన అప్ డేట్ లు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా పెంచడంతో సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి ఈ నేపథ్యంలో ఈ చిత్రం తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రభాస్ మారుతి సినిమా చేయడానికి మాత్రం కొంత మంది ఒప్పుకోవడం లేదు గత కొన్ని రోజులుగా ఈ సినిమా తెరకెక్కబోతోంది అని వార్తలు వస్తూ ఉండగా చాలామంది ఈ సినిమా ఉంటుందనే అనుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో కొంతమంది ప్రభాస్ అభిమానులు ఈ సినిమా చేయకుండా ఉంటేనే మంచిదని సలహా ఇస్తున్నారు. దాని కి కారణం లేకపోలేదు. పెద్ద దర్శకులతో చిత్రాలను చేస్తున్న ప్రభాస్ సినిమా చేయడం ఆయన కెరియర్ కు ఉపయోగకరంగా ఉండదని వారి అభిప్రాయం. అందుకే దీనికి సంబంధించి చాలామంది మారుతి ఈ సినిమాను చేయవద్దు అని సలహాలు ఇస్తున్నారు కానీ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు కావడంతో అని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభాస్ ఏదై నా నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. ఆది పురుష్ ప్రాజెక్ట్ కే స్పిరిట్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తున్న ప్రభాస్ ఈ చిత్రంతో ఏవిధంగా తన ఆలోచన ధోరణి ని మారుస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: