రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు పలు ప్రాజెక్టులు సెట్స్ మీదకు వెళ్ళపోతున్నాయి. శంకర్ దర్శకత్వంలోని సినిమా పైనే ఆయన పూర్తి దృష్టి పెట్టీనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. భారీ బద్గేట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కి మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. 

అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసి భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చే విషయంలో రామ్ చరణ్ విఫలమయ్యాడనే చెప్పాలి. ఈ విషయంలో ఆయన పూర్తిగా విఫలం అయ్యాడు. ఎందుకో తెలియదు గాని ఎన్టీఆర్ సినిమాలకు వచ్చిన క్రేజ్ ఈ హీరో సినిమా లకు రాలేదు. సినిమా ఓపెనింగ్ సమయం నుంచి భారీ స్థాయిలో మార్కెటింగ్ చేసుకుంటున్నారు అందరూ హీరోలు. అలాంటి నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన క్రేజ్ ను తెచ్చుకునే విషయంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు రామ్ చరణ్. 

అంతేకాదు ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని సినిమా కు సైతం ఏమాత్రం మార్కెటింగ్ చేయలేక పోయా డు. ఆ సినిమా వస్తుంది అన్న ఊహే కానీ ఆ చిత్రాన్ని ఏవిధంగా చేయాలి అనే ఓ ప్రణాళికలు ఇప్పటిదాకా చేయకపోవడం రామ్ చరణ్ ముందుకు వెళ్ల లేకపోవడానికి కారణం అని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాం ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఎందుకు ఈ విధంగా వెనకబడి పోతున్నాడు అని మెగా అభిమానులు తెగ కలవరపాటు వ్యక్తపరుస్తున్నారు. మరి రామ్ చరణ్ ఈ విధంగా తన సినిమాలకు సంబంధించిన విషయాలలో ముందుచూపుతో ఉండి వాటికి క్రేజ్ ను పెంచుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: