కే జి ఎఫ్
సినిమా ద్వారా ప్రేక్షకులను భారీ స్థాయిలో మెప్పించాడు దర్శకుడు
ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వం వహించిన తొలి
సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఉగ్రం
సినిమా చేసిన తరువాత ఆయన చేసిన
కేజీఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే
ప్రశాంత్ నీల్ తో
సినిమా చేయాలని చాలామంది హీరోలు కోరుకున్నారు. దేశంలోని పెద్ద హీరోలు అందరూ కూడా ఈ దర్శకుడితో
సినిమా చేయాలనే ఎంతగానో ప్రయత్నాలు చేశారు కానీ
ప్రశాంత్ మాత్రం తెలుగు హీరోలతో
సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు.
అలా
ప్రభాస్ తో కలిసి ఆయన సలార్ అనే చిత్రాన్ని మొదలుపెట్టి ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే మిగిలిన చిత్రం యొక్క షూటింగ్ కూడా చేయబోతున్నాడు. అయితే ఆయన
ఎన్టీఆర్ తో కలిసి మరొక సినిమాను ఓకే చేయడం ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశం అయ్యింది.
ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఆయన సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఎప్పటిలాగానే
ప్రశాంత్ తనదైన స్టైల్లో ఈ సినిమాకు సంబంధించిన
పోస్టర్ ను విడుదల చేశాడు.
అయితే
ఎన్టీఆర్ కు ఎంత నమ్మకం లేకపోతే ఆయన చెప్పిన లైన్ మాత్రమే విని
సినిమా ఓకే చేశాడు. వాస్తవానికి
ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించిన కథల పట్ల ఎంతో క్లారిటీ గా ఉంటాడు. పూర్తిస్థాయి స్క్రిప్ట్ విన్న తర్వాతనే ఆ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఓకే చేస్తాడు. అలాంటిది కేవలం లైన్ మాత్రమే విని
ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా ను ఓకే చేయడం
ఇండస్ట్రీ వర్గాలను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. మరి
ఎన్టీఆర్ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ దర్శకుడు ఆయనతో కలిసి ఎలాంటి
సినిమా చేస్తాడో చూడాలి.
మాస్ సినిమాలకు [పెట్టింది పేరుగా ఉన్న ఈ ఇద్దరు ఏ
సినిమా చేస్తారో చూడాలి.