సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయిన విషయం  మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా,  ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు ఆయన పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటివరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట  సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 32.21 కోట్లు
 సీడెడ్ : 11.07 కోట్లు
యూ ఎ : 11.94 కోట్లు
ఈస్ట్ : 8.18 కోట్లు
వెస్ట్ : 5.38 కోట్లు
గుంటూర్ : 8.34 కోట్లు
కృష్ణ : 5.61 కోట్లు
నెల్లూర్ : 3.34 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా 86.07 కోట్ల షేర్ , 129.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

 
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 11 రోజుల బాక్సాఫీస్  రన్ కి గాను సర్కారు వారి పాట 6.51 కోట్ల కలెక్షన్లను సాధించింది.
ఓవర్సిస్ లో సర్కారు వారి పాట సినిమా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను  12.10 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి  గాను ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట సినిమా 104 .68 కోట్ల షేర్ , 167.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: