సౌత్ నుంచి నార్త్ వరకు ఇప్పుడు ట్రేడ్ మార్కెట్లో ఎక్కడ చూసినా 'కెజిఎఫ్2' వసూళ్ల గురించే చర్చలు జరుగుతున్నాయి. 'బాహుబలి2'ని రీచ్ అవుతుందా, సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా 'ఆర్ ఆర్ ఆర్'ని దాటింది గానీ, 'బాహుబలి2' వసూళ్ల మార్క్కి దూరంగానే ఉంది.
'కెజిఎఫ్' ఫ్రాంచైజీ నుంచి థర్డ్ ఫిల్మ్ కూడా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. 'కెజిఎఫ్-2' క్లైమాక్స్లో చాప్టర్-3 ఉంటుందని హింట్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అయితే 'సలార్'తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, ఈ మూవీ పూర్తయిన వెంటనే జూ.ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడు. అంటే 'కెజిఎఫ్-3' తీయడానికి మరో రెండేళ్లుపైగా పట్టే అవకాశముందని చెప్పొచ్చు.
ఆడియన్స్కి కొత్త కొత్త సబ్జెక్టులు చాలా ఎగ్జయిటింగ్గా అనిపిస్తాయి. అందుకే ఫిల్మ్ మేకర్స్ కూడా సినిమా సినిమాకి సంబంధం లేని కథాంశాలు తెరకెక్కించాలనుకుంటారు. కానీ కొన్ని కథలని మాత్రం రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యం కాదు. అలాంటి కథలన్నీ ఫ్రాంచైజీలుగా మారుతున్నాయి. రెండు మూడు సినిమాలుగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి.
బాక్సాఫీస్తో వెంకీ ఆసనాలు వేయించిన సినిమా 'ఎఫ్-2'. భార్యబాధితుల కథాంశంతో రూపొందిన ఈ మూవీతో అనిల్ రావిపూడి ఇమేజ్ కూడా మారిపోయింది. ఇప్పుడీ సూపర్ హిట్కి కొనసాగింపుగా 'ఎఫ్-3' వస్తోంది. ఇక ఈ 'ఎఫ్-3' తర్వాత 'ఎఫ్-4, ఎఫ్-5' సినిమాలు కూడా వస్తాయని, జేమ్స్ బాండ్ తరహాలో కొనసాగుతూనే ఉంటుంది అంటున్నారు మేకర్స్.
క్రైమ్ థ్రిల్లర్స్, స్పై స్టోరీస్తో హిట్స్ కొడుతోన్న అడివి శేష్ రీసెంట్గా 'హిట్' ఫ్రాంచైజీలో చేరిపోయాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్-2' సినిమా చేస్తున్నాడు. అయితే 'హిట్' మూవీలో విశ్వక్సేన్ హీరోగా చేశాడు. కానీ డేట్స్ ఇష్యూతో విశ్వక్ సేన్ సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అడివి శేష్ని తీసుకున్నారు.