సమంత పెళ్లి తర్వాత కమర్షియల్‌ మూవీస్ తగ్గించింది. లేట్‌ అయినా సరే స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ కావాలని లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కే సైన్ చేసింది. అయితే విడాకుల తర్వాత మళ్లీ కమర్షియల్‌ మూవీస్‌లోకి వస్తోంది. మునుపటి గ్లామర్‌ తగ్గలేదని 'పుష్ప'తో ప్రూవ్‌ చేసంది. ఊ అంటావా అని మాస్‌ పాటకి స్టెప్పులేసింది. రెజీనాకి తెలుగులో 'జ్యో అచ్యుతానంద' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. డిజాస్టర్స్‌తో రెజీనా జర్నీకి బ్రేకులు పడ్డాయి. మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. ఇలాంటి టైమ్‌లో 'ఎవరు' సినిమాలో నెగటివ్‌ రోల్‌ కూడా ప్లే చేసింది. విశాల్‌ 'చక్ర' సినిమాలో కూడా విలన్‌గా చేసింది. అయినా హీరోయిన్‌ రోల్స్‌ రావడంలేదు.
తెలుగు ఆడియన్స్‌ అంతా మర్చిపోతోన్న సమయంలో  'ఆచార్య'లో సానా కష్టం అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది రెజీనా.

ట్రెండ్‌ని క్యాష్‌ చేసుకునే వాళ్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. సిట్యువేషన్‌కి తగ్గట్లుగా కెరీర్‌ డిజైన్ చేసుకుంటే, కోట్లు సంపాదించొచ్చని సలహాలు ఇస్తుంటారు బిజినెస్‌ ఎనలిస్టులు. చాలామంది హీరోయిన్లు ఈ వ్యాపార సూత్రాన్ని చాలా స్ట్రాంగ్‌గా ఫాలో అవుతున్నారు. ఐటెమ్‌ సాంగ్స్‌తో బ్యాంక్‌ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారు. 'జాతిరత్నాలు' సినిమాతో సూపర్ హిట్‌ కొట్టింది ఫరియా అబ్దుల్లా. క్యూట్‌ యాక్టింగ్‌తో రోబో చిట్టి కంటే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. బాలీవుడ్‌ నుంచి ఆఫర్స్ వస్తున్నాయనే ప్రచారం జరిగింది. అయితే కెరీర్‌ బిగినింగ్‌లోనే ఫరియా స్పెషల్‌ సాంగ్స్‌ కూడా స్టార్ట్ చేసింది. 'బంగార్రాజు' సినిమాలో వాసివాడి తస్సాదియ్యా అంటూ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది ఫరియా.


పూజా హెగ్డే తెలుగుతో పాటు, హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్స్‌తో స్టెప్పులేస్తూ బీటౌన్‌ స్టార్ హీరోయిన్‌గా మారుతోంది. అయితే సినిమాలతోపాటు ఐటెమ్‌ సాంగ్స్‌ కూడా చేస్తోంది. 'రంగస్థలం'లో జిగేలురాణిగా మాస్‌ స్టెప్పులేసిన పూజ, ఇప్పుడు 'ఎఫ్-3'లో కూడా ఐటెమ్ సాంగ్ చేస్తోంది. ఇక ఈ సాంగ్‌కి కోటి వరకు తీసుకుందట పూజ.

కాజల్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది గానీ, మనుపటిలా బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్స్ రాట్లేదు. సీనియర్ల సినిమాలతోనే సర్దుకుంటోంది. అయితే ఈ చందమామ కూడా హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో ఐటెమ్ సాంగ్ చేసింది. 'జనతాగ్యారేజ్' లో పక్కాలోకల్‌ అంటూ నాటు స్టెప్పులేసింది కాజల్. తమన్నకి స్టార్ హీరోస్‌ నుంచి ఆఫర్స్ తగ్గిపోయాయి. థర్టీ ప్లస్‌లో ఉందని, కుర్ర హీరోలు మిల్కీని పక్కన పెడుతున్నారు. దీంతో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది తమన్నా. అయితే జర్నీ బిజీగా ఉండడానికి సీనియర్ల సినిమాలతో పాటు ఐటెమ్‌ సాంగ్స్‌ కూడా చేస్తోంది. 'అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసిన తమన్న ఇప్పుడు వరుణ్‌ తేజ్ 'గని'లో కొడితే అనే స్పెషల్‌ సాంగ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: