తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నీమధ్య సర్కారు వారి పాట సినిమా తో ప్రెక్షకులను పలకరించాడు.. ఆ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మహేష్ బాబు ఖాతాలో ఈ సినిమా కూడా హిట్ టాక్ ను అందుకుంది. సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌కు చేరువలో ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన తీరు వారిని అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మరోసారి తనలోని మాస్‌ను బయటపెట్టాడు మహేష్.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను మహేష్ లైన్ లో పెడుతూ వచ్చాడు.


ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజాలు ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాయంటే, వీరి కాంబోలో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఆల్రెడీ ఓ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథకు అనుగుణంగా ఉండేలా 'అర్జునుడు' అనే టైటిల్‌ను ఈ చిత్రం కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

 

కాగా,ఈ టైటిల్ చాలా పాతదే అయినా, ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అంతేగాక ఈ సినిమా టైటిల్ విషయంలో మహేష్ కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాకు 'అర్జునుడు' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు మహేష్ అండ్ త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ సక్సెస్ కొడతారని ప్రిన్స్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: