కేజీఎఫ్..ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎటువంటి అంచనాలు లేకుండా థియెటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారీఎ విజయన్నిఅందుకుంది.కన్నడ స్టార్ హీరో యష్ ఈ సినిమాలో హీరోగా నటించారు.. యాక్షన్ కథ తో రూపొందిన ఈ సినిమా ఎంత హిట్ ను అందుకుంది అనేది అందరికి తెలిసిందే..ఆ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 కూడా వచ్చిన సంగతి తెలిసిందే..మొన్నీ మధ్య విడుదల అయ్యి 1000 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసింది.సినీ చరిత్రను తిరగరాసింది..ఇప్పుడు డైరెక్టర్ క్రేజ్ ఎక్కడికొ వెళ్ళింది..


వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే..ఆయనతో సినిమా చేయడానికి స్టార్‌ హీరోలు క్యూ కడుతున్నారు. కానీ ప్రశాంత్‌ మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తూ.. పాన్‌ ఇండియా చిత్రాలనే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో 'సలార్‌'చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ రూమర్ సౌత్ మొత్తం చెక్కర్లు కొడుతోంది.



సలార్‌, ఎన్టీఆర్‌ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ మరో టాలీవుడ్‌ హీరోతోనే పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని..ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది..నానిపై ఈ మధ్య కాలంలో చాలా రూమర్స్‌ వస్తున్నాయి. మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నాని కూడా నటిస్తున్నాడని టాక్‌. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న మూవీలోనూ నాని విలన్‌గా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. వీటిల్లో ఏది నిజమో, ఏది గాసిప్ అనేది నానీనే చెప్పాలి. ప్రస్తుతం నాని 'అంటే సుందరానికి..' రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ వార్త నిజమైతే ఆ సినిమా తర్వాత ప్రశాంత్  నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల నున్నారు..మరి చివరికి ఏమౌతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: