ఇక ఈ టైటిల్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రాలేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు అదే టైటిల్ తో ఇప్పటి తరానికి అనుగుణంగా కొత్త రకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారూ. దర్శకుడు మధుసూదన్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది అనేది తెలుస్తుంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్లా సినిమాస్ పతాకంపై సినిమాను నిర్మించబోతున్నారు. ఇక చిరంజీవి సినిమాకు, టైటిల్ కు ఎలాంటి మచ్చ రానీయకుండా ఇక దానికి తగ్గట్లుగానే ఈ తరానికి అనుగుణంగా తమ సినిమాను డిజైన్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఒక రివెంజ్ స్టోరీ నీ తెరకెక్కిస్తున్నామని అంటూ దర్శకుడు మధుసూదన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇక చిరంజీవి సినిమా రుద్రవీణ అనే టైటిల్తో వస్తుండడంతో ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత అటు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ పొందబోతోంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పలేదు.