పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ మూవీ బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలుగా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మొత్తంలో సగం బడ్జెట్ ను రెమ్యునరేషన్ల కోసమే ఖర్చు చేస్తున్నారని సమాచారం..


పుష్ప ది రైజ్ సక్సెస్ తో దర్శకునిగా సుకుమార్ రేంజ్ కూడా బాగా పెరిగింది. పుష్ప ది రైజ్ కథ, కథనం విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని సుకుమార్ పుష్ప ది రూల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం.


తగ్గేదేలే అనే ఒకే ఒక్క డైలాగ్ పుష్ప ది రైజ్ సక్సెస్ లో ముఖ్య పాత్ర పోషించింది. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా హిట్ గా నిలిచిన నేపథ్యంలో పుష్ప ది రూల్ సినిమాతో అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని సుకుమార్ భావిస్తున్నారని సమాచారం. పుష్ప ది రూల్ గురించి సుకుమార్ మాట్లాడుతూ బాహుబలి మరియు కేజీఎఫ్2 సినిమాలలో హీరో విలన్ మధ్య వార్ ను మరో లెవెల్ లో చూపించారని పుష్ప2 విషయంలో తాను కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నానని ఆయన అన్నారు.


 


బన్నీ ఫహద్ ఫాజిల్ మధ్య గేమ్ సీన్ పుష్ప ది రూల్ కు ఎంతో హైలెట్ గా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప2 మరింత ఇంప్రెసివ్ గా ఉండటంతో పాటు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటాయని సుకుమార్ కామెంట్లు కూడా చేశారు. పుష్ప ది రూల్ ను జులై నుంచి స్టార్ట్ చేస్తామని సుకుమార్ చెప్పినట్టు తెలుస్తుంది.. మారేడుమల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం.


 


2023 సంవత్సరం జనవరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తికానుందని సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.. వేసవిలో గ్రాండ్ గా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో అద్భుతాలు చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: