ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాల్టీ షో చేస్తున్న హంగామా ఎంతగా చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ షోపై అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముడుతూనే ఉన్నాయి. అయినా సరే వీటిని పట్టించుకోకుండా బిగ్ బాస్ నిర్వాహకులు తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటిటిలో కూడా విడుదల చేశారు. ఈ షోపై పలువురు వివాదాస్పదమైన వ్యాఖ్య లు చేయడమే కాకుండా కంటెస్టెంట్ లు కూడా చాలా రచ్చ చేశారు.

ఓటిటీలో మాత్రం ఈ వర్షన్ చాలా విజయవంతం గా  ముగిసింది కిశోర్ బిందుమాధవి విజేతగా నిలిచి 90 లక్షల రూపాయలను సొంతం చేసుకున్నది. ప్రస్తుతం తమకు టాలీవుడ్ లో భారీగానే ఆఫర్ లభిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఒక స్టార్ హీరో సినిమాల్లో కూడా నటించి ఎందుకు ఈమెకు అవకాశం వచ్చినట్లు గా ప్రచారం జరుగుతున్నది. ఇదంతా ఇలా ఉంటే బిగ్ బాస్-6 కూడా త్వరలో ప్రారంభం కానుంది బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటీ లో సీజన్ పూర్తయిన వెంటనే 6 కు  పనులు మొదలుపెట్టారు. తాజాగా అందుకు సంబంధించిన ఒక ప్రోమో ని స్టార్ మా లో రిలీజ్ చేసింది ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో సామాన్యులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఒక గుడ్ న్యూస్ తెలపడం విశేషం. సీజన్ సిక్స్ లో సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నామని అంటూ ఇ షో నిర్వాహకులు ప్రకటించారు. ఇన్నాళ్లు ఇంట్లో ఉండి బిగ్ బాస్ చుశారు ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదా ఫస్ట్ టైం గోల్డెన్ ఛాన్స్ అంటే నాగార్జున తాజాగా ఒక ప్రోమో లో తెలియజేయడం జరిగింది. ప్రతి సీజన్లో సెలబ్రిటీల తో, ట్రాన్స్ జెండర్ తో చేసిన బిగ్ బాస్ ఇప్పుడు తాజాగా సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: