టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లోకి క్రేజ్ ఉన్న కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శంకర్ తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఒక తెలుగు హీరోతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాకు తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమా లతో పాటు శింబు హీరో గా తెరకెక్కిన మానాడు సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు నాగ చైతన్య హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి ఇప్పటికే కమిట్ అ య్యాడు. మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ ప్రారంభం కాబోతుంది. ఇలా కొంత మంది తమిళ దర్శకులు ప్రస్తుతం టాలీవుడ్ హీరోలపై ఫోకస్ పెట్టారు.