త్వరలో థ్యాంక్ యు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీగా చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్న అమ్మడు ఇప్పుడు సెకండ్ సినిమా ఛాన్స్ కూడా అక్కినేని హీరోదే అందుకోవడం విశేషం. ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా మొదటి రెండు సినిమాలు అక్కినేని హీరోలతోనే చేసింది.
నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ ను సినిమాలో నటించింది. అయితే ఆ రెండు సినిమాల వల్ల తను పాపులర్ కాకపోయినా అక్కినేని హీరోలతో ఎంట్రీ ఇస్తే ఆ సెంటిమెంట్ తో కెరియర్ మాత్రం సక్సెస్ అవుతుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. అందుకే అమ్మడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హిట్ అందుకుంది. ఆ హిట్ తో నిధి అగర్వాల్ క్రేజ్ కూడా పెరిగింది. మొత్తానికి ఇప్పుడు అఖిల్, నాగ చైతన్య ఇద్దరు సాక్షి వైద్యతో జోడీ కడుతున్నారు.