నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల రిలీజ్ అయిన అఖండ మూవీ ఎంతటి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను తీసిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కూడా తన అత్యద్భుత నటనతో ప్రేక్షకాభిమానులుని మెప్పించారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు గోపీచంద్ మలినేని లేటెస్ట్ గా బాలకృష్ణతో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. 
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుండగా రాక్ స్టార్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో రవితేజ తో బలుపు, క్రాక్ వంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకంగా పేరు సంపాదించినా గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో చేస్తున్న ఈ భారీ మూవీ కోసం అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ తో కూడిన పక్కాగా సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. 

ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ తో పటు ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించేలా దర్శకుడు గోపీచంద్ ఈ సినిమా తీస్తున్నారని, అలానే నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ రోల్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందట. అయితే విషయం ఏమిటంటే, నేడు తెలుగు వారి ఆరాధ్యదైవం సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మూవీ నుండి ఒక ప్రత్యేక లేటెస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్ లో పవర్ఫుల్ గా కత్తి పట్టుకుని బాలకృష్ణ నిల్చుని ఉండడం బట్టి చూస్తూనే మూవీ ఎంత పవర్ఫుల్ గా రూపొందుతోందో అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాని ఈ ఏడాది దసరా కి రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: