సూపర్ స్టార్ మహేష్ బాబు , డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్లో ఇది 28 వ చిత్రం. గతంలో మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా, అతడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. థియేటర్స్ కంటే ఈ రెండు చిత్రాలు టీవీలోనే విపరీతంగా ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇప్పుడు మరొకసారి మహేష్ తో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా జరగబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నందమూరి హీరో నటిస్తున్నారని గతకొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. మహేష్ సినిమాలో విలన్ గా నందమూరి తారకరత్న కనిపించబోతున్నారని వార్త కూడా వైరల్ గా మారింది. ఇక అంతే కాకుండా ఒక క్లిప్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.


ఈ విషయంపై నందమూరి హీరో స్పందిస్తూ ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. తనకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదని ఎవరో ఫేక్ ఖాతాను సృష్టించి తన పేరుతో ఇలా ట్వీట్ చేశారు అని తెలియజేశాడు. ఇలాంటి వార్తలను అస్సలు నమ్మొద్దు అని హీరో నందమూరి తారకరత్న తెలియజేశారు. ఈ విషయం పై గతంలో కూడా ఆయన ఫేక్ ఖాతా ద్వారా తెలిపారు.. తన కు సంబంధించి ఎటువంటి విషయం అయినా సరే.. తన పి ఆర్ టీమ్ నుంచి సమాచారం అందుతుంది అని తెలియజేశారు. దయచేసి ఇలాంటి  ఫాల్స్ న్యూస్ ని వైరల్ గా చేయొద్దండి అంటూ నందమూరి తారకరత్న తెలియజేయడం జరిగింది. ఇక మహేష్ అభిమానులకు ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: