తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహ,  లెజెండ్ , అఖండ మూడు సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు కూడా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లే. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్బస్టర్ విజయాలను సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి.

ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా అఖండ 175 రోజుల వేడుకను తాజాగా జరుపుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ అఖండ సినిమా 2 డిసెంబర్ 2021 న థియేటర్లలో విడుదల అయ్యింది. థియేటర్లలో విడుదల అయిన మొదటి షో నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను బ్లాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అఖండ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి వీరిద్దరి కాంబినేషన్ లో హైట్రిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. పూర్ణ మరో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తాజాగా 175 రోజుల వేడుకను జరుపుకుంది.

 అఖండ 175 రోజుల వేడుకలో బాలకృష్ణ  కేక్‌ ను కట్ చేసి , ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్లు, డైరెక్టర్, ఫ్యాన్స్‌కు షీల్డులను అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ మూవీ తన తండ్రి నందమూరి తారక రామారావుకు అంకిత చేస్తున్నట్లు చెప్పారు. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బోయపాటి శ్రీను అంటే.. తనకు చాలా నమ్మకమని.. అతను ఎంతో చిత్తశుద్ధితో వర్క్ చేస్తాడు అని బాలకృష్ణ 'అఖండ' సినిమా 175 రోజుల వేడుక సందర్భంగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: