బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు షారుక్ ఖాన్ .ఇక ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. అయితే బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషా చిత్రాలలో కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.అంతేకాదు అలాగే భారత దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా పొందారు షారుక్ ఖాన్.ఇదిలావుంటే ఇప్పుడు తాజాగా షారుఖాన్ ఇంటికి సంబంధించి నేమ్ ప్లేట్ ను ఎవరో దొంగలు చోరీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి షారుక్ ఖాన్ ఇంటికి కేరాఫ్ అయినటువంటి మన్నత్ నేమ్ ప్లేట్ కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం ఇదే విషయం పై సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది..

 ఎవరో దొంగలించారు అని కొంతమంది అంటూ ఉంటే..లేదు వేరే కారణం కూడా ఉంది అని మరి కొంతమంది అంటున్నారు ...ఇక అసలు విషయంలోకి వెళితే ...ఆయన ఇంటిముందు ఉన్న మన్నత్.. అంటే ఏమిటి అంటే.. బాంద్రా బీచ్ రోడ్డు సైడ్ వెళ్తుంటే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నివాసానికి ఆయన ఇంటి ముందు ఉండే పేరు ఇది. అయితే ఇక అభిమానులు ప్రముఖులు ఎవరైనా సరే షారుక్ ఖాన్ ను కలవాలి అంటే మన్నత్ లో అడుగు పెట్టాల్సిందే.  బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో షారుఖాన్ ఇంటికి బ్రాండ్ గా నిలిచిన ఈ పేరు ప్రస్తుతం కనిపించడం లేదు.అయితే  ఎవరు దొంగతనం చేశారు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పలువురు నెటిజన్లు నిజంగానే ఈ బోర్డు చోరీకి గురైందా..

లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అంటూ చర్చించుకుంటున్నారు.అయితే  వజ్రాలు పొదిగిన ఈ నేమ్ ప్లేట్ విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటున్నట్లు సమాచారం.కాగా అసలు విషయం ఏమిటంటే షారుక్ ఖాన్ ఇంటి బాధ్యత మొత్తం ఆయన సతీమణి గౌరీఖాన్ చూసుకుంటూ ఉంటారట. అయితే ఇంటీరియర్ డిజైనర్ ఆమె కావడం వల్ల ఇల్లు ఎలా ఉండాలి అనే విషయం కూడా ఆమె చూసుకుంటుంది. తాజాగా ఇటీవల ఏప్రిల్లో కూడా పాత నేమ్ ప్లేట్ తొలగించి కొత్త ప్లేట్ అమర్చారు. అయితే అత్యంత ఖరీదైన నేమ్ ప్లేట్ గా చెప్పుకుంటున్న ఈ బోర్డు లో ఒక చిన్న వజ్రం చోరీ అయిందట అందుకే దానిని రిపేరు కోసం తొలగించారు అని త్వరలోనే మళ్లీ ఇంటి ముందు పెట్టేస్తారు అని సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: