ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శేరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే కాలంలో పాన్ ఇండియా సినిమా గా వస్తున్న చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయిలో ఉండగా ప్రభాస్ చేసిన గత రెండు చిత్రాలతో ప్రేక్షకులను మెపించలేకపోయాడు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప సినిమా ఆ తర్వాత విడుదలైన ఆర్ ఆర్ ఆర్ కే జి ఎఫ్ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి సరికొత్త ట్రెండ్ ను సృష్టించాయి.

పుష్ప 350 కోట్లకు పైగా రాబట్టగా అర్ అర్ అర్ మరియు కే జి ఎఫ్ 2 సినిమాలు వెయ్యి కోట్లకు మించి వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాల తరువాత అంతటి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ప్రభాస్ నటించిన చిత్రాలు సరైన ఫలితాన్ని అందించక పోవడంతో ఈ సినిమా పైనే ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. .

సినిమా యొక్క గ్రాఫిక్స్ కోసం ఏకంగా 250 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పను లకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆ విధంగా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. షూటింగ్ పూర్తయి పోస్ట ప్రొడక్షన్ పనులు జరుగుతున్న కూడా ఇంతవరకూ ఈ సినిమాకు సంబంధించి ఒక లుక్ ను కూడా వదలక పోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదల చేస్తున్నారు ఎంతలేదన్నా ఏడు నెలల సమయం ఉంది కాబట్టి లుక్ ఇప్పుడు విడుదల చేస్తే సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉందని కొంతమంది చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: