బాహుబలి సినిమా తర్వాత భారీ సినిమాలలో నటిస్తుంది అని భావించిన అనుష్క అభిమానులకు తీవ్రమైన నిరాశ ఏర్పడింది. ఆ చిత్రం తర్వాత రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన అనుష్క పెద్ద హీరోతో కలిసి నటించక పోవడం ఈమె సినిమాలకు కావాలని దూరం అవుతుందా అన్న అనుమానాలకు తెర తీసింది. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా బాక్సాఫీస్ సక్సెస్ ను చూసి చాలాకాలం అయ్యింది అనుష్క. ఆమె తదుపరి సినిమా కోసం సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచస్తున్నారు.
బాహుబలి సినిమా తర్వాత అందులో నటించిన అందరూ కూడా ఎంతో బిజీగా మారుతుంటే అనుష్క మాత్రం తదుపరి సినిమాల విషయంలో ఎంతో నెమ్మదిగా అడుగులు వేస్తోంది.

భాగమతి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా ఆమె కెరియర్ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. మధ్యలో నిశబ్దం అనే సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా ఆమె ఇమేజ్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఆమె మరొక హిట్ సినిమాల్లో నటిస్తే తప్పకుండా సక్సెస్ ట్రాక్ కి వస్తుంది అనేది ఆమె అభిమానుల మాట. అయినా కూడా ఈ బ్యూటీ ఎందుకు సినిమాలను ఓకే చేసుకోవడంలో ఆలస్యం గా ఉందో తెలియడం లేదు. తాజాగా ఆమె నటించబోయే తదుపరి సినిమా పై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా ఆమె ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరో కంటే పెద్ద వయసు ఉన్న అమ్మాయిగా కనిపిస్తుందట. ఈ ఇద్దరి మధ్యలో ఉండే ఓ వైవిధ్యమైన ప్రేమకథా సినిమా చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం అనుష్క బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఈ బ్యూటీ విదేశాలకు వెళ్లి తాను అనుకున్న ఆకృతి మార్చుకోవడం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందట. అంతేకాదు ఇప్పుడు ఇంకాస్త  కొంత సమయం అడిగినట్లుగా తెలుస్తోంది .వాస్తవానికి జూన్ నెలలో సినిమా షూట్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అనుష్క మరింత సమయం అడిగిన ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎప్పుడు తెరకెక్కుతుందో అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: