ఏదైనా సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ లను భారీగా బాక్సాఫీస్ దగ్గర సాధించి ఓటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి సినిమా కనుక ప్రశంసలు పొందినట్లయితే ఈ సినిమాలకు సీక్వల్ లను తెరకెక్కించడం ఈ రోజుల్లో చాలానే చూస్తూ ఉన్నాం. 

అయితే 24 అక్టోబర్ 2014 వ తేదీన నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ సినిమా విడుదలైన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్లను వసూలు చేసుకుని అటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొంది మంచి విజయాన్ని సాధించిన ఈ మూవీ కి ఇన్ని సంవత్సరాల తర్వాత సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కూడా చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటుడు శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు నీటిలో ఒక పడవపై వెళుతూ దీనినే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నట్టుగా ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కార్తికేయ 2 సినిమాను జూలై 22 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో కార్తికేయ 2 సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: