విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. 2020 వ సంవత్సరంలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా తర్వాత ఏ చిత్రాన్ని విడుదల చేయలేక పోయాడు. దాంతో ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమాను మొదలు పెట్టిన ఆయన దాన్ని పూర్తి చేసి ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధంగా చేశాడు.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే దర్శకుడితో కలిసి రౌడీ జనగణమన అనే మరో సినిమాను కూడా మొదలు పెట్టాడు. విజయ్ దేవరకొండ ఓకే దర్శకుడితో వరుసగా రెండు సినిమాలు చేయడం అనేది ఎంతో అరుదైన సంఘటన అనే చెప్పాలి. ఈ విధంగా చేసిన హీరో దర్శకుడు ఈ ఇద్దరు మాత్రమే అని చెప్పాలి. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినా కూడా రెగ్యులర్ షూటింగును ప్రారంభించడానికి ఇంకాస్త సమయం ఉంది. 

దాంతో మధ్యలో ఒక సినిమాను చేయాలని చెప్పి విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పటికే కశ్మీర్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాదులో మొదలు పెట్టడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత జూలైలో జనగణమన సినిమా చిత్రీకరణ ప్రారంభం చేయనున్నారు. ఆ విధంగా వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా మారిపోయాడు. లైగర్ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల పాటు సమయాన్ని కేటాయించిన విజయ్ దేవరకొండ తదుపరి సినిమాల విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. మరి ఈ సినిమాల ద్వారా విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో విజయాలను అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

JGM