కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా అందరిని అలరిస్తున్న పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు.32 రెండేళ్ల పూర్ణ పెళ్ళికి సిద్ధం అయ్యారు. తన భాగస్వామిని పరిచయం చేశారు. కుటుంబ సభ్యుల దీవెనలతో జీవితంలో తదుపరి అంకంలోకి ప్రవేశించాను.అయితే  షానిద్ అసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ జరిగింది, అని పూర్ణ కామెంట్ పెట్టారు. అంతేకాకుండా రింగ్ ఎమోజీ పోస్ట్ చేయడంతో వారికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది .అయితే తనకు నిశ్చితార్థం  జరిగినట్లు ఈ రోజు ఆమె వెల్లడించారు.

 అంతేకాదు కాబోయే భర్త షానిద్ అస్ఫాలీతో దిగిన ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.దీనితోపాటు ''కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నా జీవితంలో తదుపరి అధ్యాయంలో అడుగు పెడుతున్నాను.అంతేకాదు  నిశ్చితార్థం జరిగింది. ఇక ఇట్స్ అఫీషియల్'' అని పూర్ణ పేర్కొన్నారు.అయితే పూర్ణకు కాబోయే భర్త షానిద్ అస్ఫాలీ  వ్యాపారవేత్త. అంతేకాదు జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఆయన సీఈవో, ఫౌండర్. దీనితోపాటు ఆయన జుమా అల్మెహరి అనే కంపెనీని సైతం స్థాపించారు. కాగా ఆఫీసు ప్రారంభించడానికి అవసరమైన సర్వీసులను అందించడంతో పాటు వీసా ప్రోసెసింగ్, ఫ్లైట్ టికెటింగ్ వంటి పలు సర్వీసులను షానిద్ అస్ఫాలీ కంపెనీ అందిస్తుందని తెలుస్తోంది.

ఇకపోతే 'అఖండ' సినిమాలో పూర్ణ కీలక పాత్రలో కనిపించారు.కాగా  'బ్యాక్ డోర్'తో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక  ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.అయితే  ఇటీవల 'కామెడీ స్టార్స్ ధమాకా', 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా సందడి చేశారు.ఇకపోతే  పూర్ణ కాబోయేవాడిని పరిచయం చేయడంతో అభిమానులు, సన్నిహితులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.అంతేకాదు  వారి జంట ముచ్చటగా ఉందని కితాబు ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం పూర్ణ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది.పూర్ణ కెరీర్ మొదలై చాలా కాలం అవుతుంది. ఈమె నటిగా 2004లో ఆమె కెరీర్ మొదలైంది.అయితే  2007లో విడుదలైన మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.ఇకపోతే  ఆమెకు సీమ టపాకాయ్ మూవీ గుర్తింపు తెచ్చింది. కాగా 2011లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: