ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోయిన్ లు వరుసగా వివాహం బాట పట్టిస్తున్నారు. ఇక క్రేజీ హీరోయిన్లు సైతం మినిమమ్ గ్యారెంటీ హిట్లతో బాలీవుడ్ లో బాగానే దూసుకుపోతున్నారు. ఇక ఇటీవల కాజల్ అగర్వాల్, ప్రణీత వంటి వారు వివాహం చేసుకొని పండంటి పిల్లలకు జన్మనిచ్చారు. ఇక దీనితో సినిమాలకు గుడ్బై చెప్పేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే బాటలో మరొక హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. కొన్ని రోజులుగా పెళ్లంటే దూరం మెయింటైన్ చేస్తూ ఉన్న హీరోయిన్ ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది.

తను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే రవిబాబు తెరకెక్కించిన అవును చిత్రం, సీమటపాకాయ్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమెకు హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నది. ఇక పూర్ణ టీవీ షోలలో కూడా బాగానే అలరిస్తూ ఉన్నది. 2007లో రియల్ స్టార్ శ్రీహరి డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లో తన కెరీర్ ని ప్రారంభించినది.


ఇక ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత వెను తిరిగి చూడని పూర్ణ ఆ తర్వాత మంచి అవకాశాలను సంపాదించుకుంది. ఇక తాను వివాహం చేసుకోబోయే అతడిని పరిచయం చేస్తూ తనకు 32 ఏళ్ల పూర్ణ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో త్వరలోనే తదుపరి జీవితంలోకి అడుగు పెట్టపోతున్నాను అని తెలిపింది. షానిద్ ఆసిఫ్ ఆలీతో తన ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఈమె తెలియజేసింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ జేసింది పూర్ణ. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: